Tuesday, 28 July 2026 07:39:08 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఆదివాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం ఆపరా..

తుడుం దెబ్బ ఖండన, హక్కు పట్టాల డిమాండ్

Date : 22 June 2026 09:05 PM Views : 70

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లానచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి, కొందరిని బలవంతంగాతీసుకెళ్లారనిగ్రామస్తులుఆరోపించారు.బాధితులను పరామర్శించిన నాయకులు, పోడు భూములకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.విషయం తెలిసిన వెంటనే తుడుం దెబ్బ నాయకత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో నిర్బంధించిన వారిని విడుదల చేశారని పేర్కొన్నారు.తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడమ్ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామాన్ని సందర్శించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఇటీవల ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది.బాధితులను నాయకులు పరామర్శించారు. పోడు భూములకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి, కొందరిని బలవంతంగా తీసుకెళ్లారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆదివాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తుడుం దెబ్బ నాయకత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో నిర్బంధించిన వారిని విడుదల చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోడమ్ గణేష్ మాట్లాడుతూ, పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం వెంటనే ఉమ్మడి హక్కు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు రాజ్యాంగం, చట్టాలకు లోబడి పనిచేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఆదివాసి గూడాలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అటవీ అధికారుల వేధింపులు కొనసాగితే ప్రజా సంఘాలను ఏకం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుచేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోడసం గోవర్ధన్, రాష్ట్ర నాయకులు ఆనందరావు, ఆర్క శేషారావు, సామాజిక కార్యకర్తలు, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిదం జంగు దేవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: