Saturday, 12 September 2026 10:22:07 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా

మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్

Date : 15 May 2026 06:26 AM Views : 143

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అభివృద్ధి చేసేందుకు శాయ శక్తుల కృషి చేస్తానని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. కళాశాలలో జరిగిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే నిధులు కేటాయించారని, మంత్రి సహాయ సహకారాలతో కళాశాలను మరింతగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇంత అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్న ఈ కళాశాల విద్యార్థిని ప్రభుత్వ కళాశాలలో జిల్లాలో మొదటి స్థానం సాధించడం అభినందనీయమన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలలో చదివే బదులు అదే స్థాయిలో విద్యనందిస్తున్న ప్రభుత్వ సంస్థను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అత్యుత్తమ పలితాలు సాధించిన విద్యార్థినిలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలోజీ, అధ్యాపకులు రావుల తిరుమల్, శశాంక్ , శ్రీదేవి, నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి, సబిత, మౌనిక, సిబ్బంది బియ్యబాని, అనసూయ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :