Tuesday, 28 July 2026 11:36:40 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా

మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్

Date : 15 May 2026 06:26 AM Views : 108

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అభివృద్ధి చేసేందుకు శాయ శక్తుల కృషి చేస్తానని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. కళాశాలలో జరిగిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే నిధులు కేటాయించారని, మంత్రి సహాయ సహకారాలతో కళాశాలను మరింతగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇంత అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్న ఈ కళాశాల విద్యార్థిని ప్రభుత్వ కళాశాలలో జిల్లాలో మొదటి స్థానం సాధించడం అభినందనీయమన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలలో చదివే బదులు అదే స్థాయిలో విద్యనందిస్తున్న ప్రభుత్వ సంస్థను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అత్యుత్తమ పలితాలు సాధించిన విద్యార్థినిలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలోజీ, అధ్యాపకులు రావుల తిరుమల్, శశాంక్ , శ్రీదేవి, నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి, సబిత, మౌనిక, సిబ్బంది బియ్యబాని, అనసూయ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :