Tuesday, 28 July 2026 11:42:41 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

కన్నుల పండవగా కార్తీక పౌర్ణమి జాతర

భక్త జన సందోహంతో క్రిక్కిరిసిన ఆలయం

Date : 05 November 2025 07:08 PM Views : 277

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యదేవుని ఆలయం లో కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం భక్తులు కార్తీక పౌర్ణమి జాతరను కన్నుల పండవగా జరుపుకున్నారు. వేలాదిమంది భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తజన సందోహంతో క్రిక్కిరిసిపోయింది. ఉదయం నుండి భక్తులు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా వేలాదిమందిగా తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. సామూహిక సత్యనారాయణ వ్రత మండపంలో సుమారు 1300 జంటలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఒకేసారి వేలాదిమందిగా భక్తులు తరలిరావడంతో వచ్చిన వారందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎండ బారిన పడకుండా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరును అందుబాటులో ఉంచారు. పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో వాలంటీర్లు వచ్చిన భక్తులకు సేవలు అందించారు. గోదావరి వద్ద స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి భద్రత చేపట్టారు. భక్తులు సత్యదేవుని దర్శించుకున్న అనంతరం సమీపాన్ని గల అభినవ శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట గల రావి చెట్టు వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో పాటు డీసీపీ భాస్కర్ ఎసిపి ప్రకాష్ లు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వీరిని సాంప్రదాయ రీతిలో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి చిత్రపటాలతో అందజేసి శాలువాలతో సత్కరించారు. ట్రాఫిక్ కు ఎలాంటి సమస్య తలెత్తకుండా సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసీనుద్దీన్, అనూష, పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :