Wednesday, 29 July 2026 02:33:31 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రాజన్న ఆలయం బంద్ అనేది అవాస్తవం

విప్ ఆది శ్రీనివాస్

Date : 13 October 2025 07:55 AM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న ఆలయం బంద్ అనేది అవాస్తవమని, స్వామి వారికి జరిగే నిత్య పూజలు ఏకాంతగా జరుగుతాయి. ఆలయంలో పనులు జరిగే క్రమంలో భక్తుల సేఫ్టీ కోసం అల్ట్నేనెట్ గా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని ఆలయ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇప్పటికే రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం చేసుకున్నామని, రూ. 150 కోట్లతో అభివృద్ధి, విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. శృంగేరి పీఠాదిపతులు,శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ది పనులు కొనసాగుతున్నారన్నారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 3 కోట్ల 40 లక్షలతో సౌకర్యాలు కల్పించామని, అత్యంత ప్రాచీనమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా ఆర్జిత సేవలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రజలు, ఇతర ప్రముఖులు, ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు సూచనలు సలహాలు కూడా ఇది వరకు తీసుకున్నామని, ఇవ్వాళ సూచించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశాము, భక్తులు సహకరించాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :