ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న ఆలయం బంద్ అనేది అవాస్తవమని, స్వామి వారికి జరిగే నిత్య పూజలు ఏకాంతగా జరుగుతాయి. ఆలయంలో పనులు జరిగే క్రమంలో భక్తుల సేఫ్టీ కోసం అల్ట్నేనెట్ గా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని ఆలయ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇప్పటికే రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం చేసుకున్నామని, రూ. 150 కోట్లతో అభివృద్ధి, విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. శృంగేరి పీఠాదిపతులు,శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ది పనులు కొనసాగుతున్నారన్నారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 3 కోట్ల 40 లక్షలతో సౌకర్యాలు కల్పించామని, అత్యంత ప్రాచీనమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా ఆర్జిత సేవలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రజలు, ఇతర ప్రముఖులు, ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు సూచనలు సలహాలు కూడా ఇది వరకు తీసుకున్నామని, ఇవ్వాళ సూచించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశాము, భక్తులు సహకరించాలని కోరారు.
Admin
E Nivas News