ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక చిన్న టీ షాప్కు బుధవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెళ్లారు. తన కాళ్ల మీద తాను నిలబడి జీవనం సాగిస్తున్న మహిళను ఆప్యాయంగా కలుసుకునీ శాలువాతో సత్కరించారు. కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి ఉపయోగించకుండా ఎలక్ట్రిక్ పొయ్యితో టీ తయారు చేస్తూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా జీవనం సాగిస్తున్న ఆమెను అభినందించారు. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, పొగరహిత విధానాన్ని ఎంచుకుని పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు ఆమెను శాలువాతో సత్కరించారు. ఆమె చేత తయారైన టీని అక్కడే ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి సెల్ఫీ కూడా దిగుతూ, స్వయం సమర్థతతో జీవించే ఆమె తీరును ప్రశంసించారు. వయస్సుతో సంబంధం లేకుండా సాంకేతిక మార్పులనుస్వీకరించడం సమాజానికి ఆదర్శమని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మార్పులు అవసరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.
Admin
E Nivas News