ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రం లో రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డిసర్కార్ కీలక నిర్ణ యం తీసుకుంది. ముందుగా ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించాలని మొదట నిర్ణయిం చింది. అక్కడ నుంచే అర్హత ఉన్న అందరి రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అధికా రులు సూచించారు. కాగా వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాం గం వేదికను మార్చింది.రైతు భరోసా నిధుల విడుదల పైనా సోమవారం మధ్యాహ్నం స్పష్టత ఇచ్చింది. మధిర నియోజక వర్గంలో జరగాల్సిన రైతు భరోసా సభనుతెలంగాణప్రభుత్వం రద్దు చేసింది.రేపు మంగళవారం సాయంత్రం 4గంట లకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో రైతు భరోసా సభ నిర్వహించేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయడం తోపాటు రైతులను ద్దేశించి మాట్లాడను న్నారు. రాష్ట్రంలో గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతా వరణం అనుకూలిం చలేదు. దీంతో రైతు లు,ప్రజల ఇబ్బందు లను దృష్టిలో ఉంచుకుని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. మధిరలో బహిరంగ సభ రద్దయినప్పటి కీ.. నిధుల విడుదల లో ఎలాంటి ఆల స్యం జరగకూడదని డిసైడ్ అయ్యారు. కాగా, ఇప్పటికే రైతు భరోసా మార్గదర్శకా లపై సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం, అర్హులైన ప్రతి రైతు కూ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంది. పెట్టు బడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వానా కాలం సీజన్లో ఈ నిధులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ముఖ్యమంత్రి సభలో నిధులు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో రై తు భరోసా నిధులు జమకానున్నాయి. కాగా ఈ సారి అర్హత ఉన్న రైతులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జూలై 5వ తేదీ వరకు పథకంలో లబ్దిదారులుగా లేని వారికి దరఖాస్తు చేసుకునేందుకు గడువుగా నిర్ణయిం చింది. వారి దరఖా స్తులు పరిశీలన చేసి.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత ఉం టే.. వారికీ భరోసా కింద నిధులు అం దించాలని ప్రభు త్వం నిర్ణయించింది.
Admin
E Nivas News