ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదివాసి మహిళను చెప్పుతో కొట్టిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చిన ఇల్లాపూర్ గోండు గూడ కు చెందిన గ్రామస్తులు, ఆదివాసి మహిళలను మంగళవారం ఉదయం 6 గంటలకి అటవీశాఖ అధికారులు వచ్చి వాళ్ళని జీపులో తన్నుకుంటూ తిట్టుకుంటూ తరలించినటువంటి ఘటన చాలా బాధాకరం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో కల్పించినట్లు హక్కులు ఆదివాసులను కించపరుస్తూ అవమానపరుస్తూ మంగళవారం వారిని ఇంధన్ పల్లి రేంజ్ లో తీసుకెళ్లి అక్కడ బాలింత మహిళ అని చూడకుండా ఆమెని కొట్టడం చెప్పులు తో కొట్టడం రకరకాలుగా తిట్టడం అక్కడి నుంచి నిర్మల్ తరలించారు ఇది గత 30 సంవత్సరాలు నుంచి పోడు భూములు చేస్తున్నటువంటి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి అట్లాగే అక్కడ 14 మంది తీసుకెళ్లిన వారిని కూడా వెంటనే విడుదల చేయాలి ఎవరైతే ఆది వాసులను కొట్టినారు తిట్టినారు వారిని చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం శిక్షించి వెంటనే వాళ్ళని తొలగించాలని రాజ్ గోండు సేవ సమితి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మంగం విషం రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ గోండు సేవా సమితి ఆత్రం రాజేశ్వర్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు తొడసం భీమ్రావు రాజ్ గోండు సేవ నాయకులు గ్రామ గ్రామస్తులు ప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
E Nivas News