ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ పార్టీ బరిలో నిలబడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తాండూర్ మండల అత్యవసర మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండుబానేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ తాండూర్ మండల స్థానిక సంస్థల ఎన్నికలో బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోటీ చేస్తుందని, గతంలో అచ్చులాపూర్ నుంచి 1995లో 2021 లో రెండుసార్లు ఎంపీటీసీగా గెలుపొందడం జరిగిందన్నారు. రేచీని నుంచి 1988లో సర్పంచ్ గా గెలవడం గెలిచారన్నారు. అదేవిధంగా కిష్టంపేట నుంచి 1995లో సర్పంచ్ గా సీటు కైవసం చేసుకోవడం జరిగిందని, చౌటపల్లి నుంచి 1981లో 1988లో రెండుసార్లు సర్పంచ్ గా ఒకసారి ఎంపీటీసీగా కూడా తమ అభ్యర్థులు గెలిచారన్నారు. ద్వారకాపూర్ నుంచి 1988లో సర్పంచ్ గా 2001లో ఎంపీటీసీగా విజయం సాధించామన్నారు. కొత్తపల్లి నుంచి 2001లో సర్పంచ్ గా గెలిచామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాండూర్ మండలం నుంచి ఎంపీటీసీగా సర్పంచ్ గా వార్డు సభ్యులుగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సమావేశంలో తీర్మానం చేశామని ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ అభ్యర్థుల కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాల న్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సాలి గామ సంతోష్, బొంతల లక్ష్మీనారాయణ, నరాల ప్రహ్లాద్, మలిశెట్టి సత్యనారాయణ, పట్టి శంకర్, కామెర దుర్గయ్య, కొండు సాయికుమార్, గ్రామ కార్యదర్శులు కుర్సింగ తిరుపతి, మిట్ట శ్రీనివాస్, కోట మొండయ్య, మీసాల సన్యాసి, ముత్తే శంకర్, గాజుల దేవయ్య, భీమేష్, కోయ సురేష్, ఎడ్ల రాజేష్, రవి. నసీర్, గొర్ల భీమన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News