ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ పట్టణంలోని కోట్నాక భీం రావు చిల్డ్రన్స్ పార్క్లో గురువారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్పర్సన్ ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్, కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ లు పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్ లు మాట్లాడుతూ పార్కును సందర్శించే చిన్న పిల్లలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరం పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా దోమలు ప్రబలకుండా, అంటువ్యాధులు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి, పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సాయి శ్రవణ్, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Admin
E Nivas News