Tuesday, 28 July 2026 08:27:39 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

చిల్డ్రన్స్ పార్క్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్....

Date : 09 July 2026 11:47 PM Views : 49

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ పట్టణంలోని కోట్నాక భీం రావు చిల్డ్రన్స్ పార్క్‌లో గురువారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్, కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ లు పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ లు మాట్లాడుతూ పార్కును సందర్శించే చిన్న పిల్లలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరం పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా దోమలు ప్రబలకుండా, అంటువ్యాధులు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి, పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సాయి శ్రవణ్, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :