ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : దీక్షా దివస్ ను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాల లో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, బీఆర్ఎస్ నాయకులు పుప్పాల తిరుపతి, పిల్లి సత్తయ్య లు కలిసి తమ స్వంత ఖర్చులతో రోగులకు పాలు, పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News