Tuesday, 28 July 2026 06:02:25 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

అభ్యాస నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాలి

Date : 03 July 2026 06:55 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విద్యార్థుల అభ్యాస స్థాయిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డా. పి. ఎం. షేక్ లు సూచించారు. మంథని మండలంలోని ఎం.పి.పి.ఎస్. గౌతమీనగర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించారు. మొదటగా ఎం.పి.పి.ఎస్. గౌతమీనగర్ పాఠశాలలో FLN (Foundational Literacy & Numeracy) అమలు, బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహించి వారి అభ్యాస స్థాయిని అంచనా వేశారు. అలాగే ప్రీ-ప్రైమరీ విభాగాన్ని సందర్శించి చిన్నారుల అభ్యాస కార్యకలాపాలను పరిశీలించారు. FLN లక్ష్యాల సాధనకు అవసరమైన పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంథనిలో Learning Improvement Programme (LIP) అమలు తీరును పరిశీలించి విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహించి అభ్యాస ఫలితాలను సమీక్షించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి అభ్యాస పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించి విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల అభ్యాస ఫలితాల పెంపు, LIP సమర్థవంతమైన అమలు, తరగతి గది బోధనలో నాణ్యత పెంపు, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి విలువైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంథని మండల విద్యాధికారి శ్రీమతి లక్ష్మి, CRP లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :