ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిఎ.రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద మంగళవారం డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా హాజరై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్పార్టీనాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియచేసారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుందని అన్నారు. మూడు విడతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించ్చిందని తెలియచేసారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News