Saturday, 13 June 2026 02:24:10 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

రెండు గంటల్లో దొంగతనం చేసిన నిందితుడి అరెస్ట్...! వంద శాతం ఆభరణాల రీకవరి

ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

Date : 10 February 2026 09:29 PM Views : 102

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును జైనథ్ పోలీసులు రెండు గంటల్లోనే చేదించి, దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను 100 శాతం తిరిగి స్వాధీనం చేసినట్లుఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం.. సాత్నాల మండలం కెనాల్ మేడిగూడ గ్రామానికి చెందిన నిందితుడు గుమ్మడి రవీందర్ (32) కూలి పని చేస్తూ మద్యానికి బానిసై ఖర్చుల కోసం డబ్బులు అవసరమై అదే గ్రామంలో నివసించే బరపటి వెంకటి ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో నిందితుడు ఇంటిలోకి చొరబడి బీరువా తాళం తీసి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగలించి తన ఇంటి వద్ద మట్టిలోదాచిపెట్టాడు. దొంగతనం విషయం వెలుగులోకి రావడంతో వెంటనే జైనథ్ పోలీస్ స్టేషన్ నందు 34/2026 అండర్ సెక్షన్ 331(3),305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి, వెంటనే రంగంలోకి దిగిన జైనథ్ పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం అతని ఇంటి సమీపంలో మట్టిలో దాచిన ఆభరణాల డబ్బాను వెలికితీసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు సుమారు 3½ తులాలు, వెండి ఆభరణాలు సుమారు 50 తులాలు, రాగి వస్తువులు సుమారు 8 తులాలు, మొత్తం దొంగలించిన వస్తువులు విలువ రూ 5,04,500 దొంగతనం కేసును రెండు గంటల్లోనే చేదించి, దొంగిలించిన ఆస్తిని 100 శాతం రికవరీ చేసిన జైనథ్ పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ప్రజల భద్రత కోసం ఇదే విధంగా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఈ కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించిన జైనథ్ సిఐ జి శ్రావణ్ ను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :