ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల బిజెపి మున్సిపల్ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి డిసిపి భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు. గత సోమవారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఫ్లోర్ లీడర్ గాజుల ముకేశ్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని అడ్డుకున్నారు. పాలకవర్గం అభివృద్ధి పనుల్లో తమ సలహాలను పట్టించుకోకుండా, తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆందోళనకు దిగారు. అనంతరం అంబేద్కర్ విగ్రహంవద్ద నిరసనకు దిగడంతో పోలీసులు నమోదు చేయడం పట్ల బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేసులు ఎత్తివేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News