ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలంలోని జామిడి గ్రామంలో శనివారం సీసీ రోడ్డు నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామస్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేర్చి గ్రామాన్ని విడతల వారిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు. రైతులు ఎక్కువగా ఉన్న జామిడి గ్రామంలో పంటలకు నీరు లేదని గ్రామస్తుల కంటతడిని విన్నానని కచ్చితంగా నీరు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
Admin
E Nivas News