Tuesday, 28 July 2026 11:35:55 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

మాట ఇస్తే నిలబెట్టుకుంటాం..

బాలికల కళాశాల మైదానాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్...

Date : 15 May 2026 03:09 PM Views : 97

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తమది చేతల ప్రభుత్వం అని ఒకసారి మాట ఇస్తే దాన్ని కచ్చితంగా నిలబెట్టుకుని తీరుతామని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా జరిగిన కార్యక్రమంలో చైర్మన్ కళాశాల మైదాన అభివృద్ధికి మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ లతో కలిసి కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడం వల్ల ఆటలకు అనుకూలంగా లేదని, మైదానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆటలకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు అవసరమైన నిధులను అంచనా వేయాల్సిందిగా మున్సిపల్ ఏఈ మౌనికను ఆదేశించారు. కొద్దిరోజుల్లోనే మైదానంలో పెరిగిన తుమ్మలు , పిచ్చి మొక్కలను తొలగించి గ్రావెల్ నింపుతామన్నారు. మైదానం అభివృద్ధి చేసిన అనంతరం మళ్లీ తానే వచ్చి ప్రారంభిస్తామన్నారు. చైర్మన్ వెంట కౌన్సిలర్లు పెంటరి రాజు, మారుపాక నిహారిక, జంబోజు సమ్మయ్య తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :