Thursday, 30 July 2026 04:09:57 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

గోదావరిఖని 11 ఇంక్లైన్ మైన్‌ ను పరిశీలించిన ఎంపీ

కార్మికుల పనితీరు, భద్రత, బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యక్షంగా అవగాహన

Date : 05 January 2026 05:01 PM Views : 248

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని 11 ఇంక్లైన్ మైన్‌ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్ లోపలికి దిగిన ఎంపీ కార్మికులు ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న పనిని పరిశీలిస్తూ అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను దగ్గరుండి చూశారు. ఎంపీ తో పాటు జీఎం లలిత్ కుమార్, సీనియర్ నాయకులు మల్లికార్జున్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రఘునాథ్ తదితరులు ఎంపీ తో ఉన్నారు. మైన్ లోపల దాదాపు ఆరు కిలోమీటర్ల మేర నడిచిన ఎంపీ ప్రతి అంశంపై జీఎం ద్వారా సమగ్ర వివరాలు సేకరించారు. ప్రత్యేకంగా కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, సేఫ్టీ పరికరాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే చర్యలపై ప్రశ్నించి తెలుసుకున్నారు. అలాగే కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య భద్రత, పని పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ “బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులే దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదనివారి భద్రత, సంక్షేమం, అవసరమైన అన్ని సదుపాయాలు అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటాం” అని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :