ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని 11 ఇంక్లైన్ మైన్ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్ లోపలికి దిగిన ఎంపీ కార్మికులు ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న పనిని పరిశీలిస్తూ అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను దగ్గరుండి చూశారు. ఎంపీ తో పాటు జీఎం లలిత్ కుమార్, సీనియర్ నాయకులు మల్లికార్జున్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రఘునాథ్ తదితరులు ఎంపీ తో ఉన్నారు. మైన్ లోపల దాదాపు ఆరు కిలోమీటర్ల మేర నడిచిన ఎంపీ ప్రతి అంశంపై జీఎం ద్వారా సమగ్ర వివరాలు సేకరించారు. ప్రత్యేకంగా కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, సేఫ్టీ పరికరాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే చర్యలపై ప్రశ్నించి తెలుసుకున్నారు. అలాగే కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య భద్రత, పని పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ “బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులే దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదనివారి భద్రత, సంక్షేమం, అవసరమైన అన్ని సదుపాయాలు అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటాం” అని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు.
Admin
E Nivas News