Friday, 11 September 2026 08:58:11 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

రీ-సర్వే, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి....

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

Date : 03 September 2026 12:26 AM Views : 64

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న రీ- సర్వే, ఎస్ఐఆర్ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం ఆయెపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను మండల తహసీల్దార్‌ రాఘవేంద్ర తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రీ-సర్వే ప్రక్రియలో నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా పాటించాలని, ఫీల్డ్ రిజిస్టర్, విలేజ్ రిజిస్టర్‌లలో వివరాలు నమోదు చేస్తూ, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, రీ-సర్వే పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కోటపల్లి మండలం అల్గావ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ లో భాగంగా చేపట్టిన విచారణను పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం భీమారం మండలం అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్ ను తహసీల్దార్‌ సదానందం తో కలిసి సందర్శించి, పెండింగ్‌లో ఉన్న సిఎంఆర్ బియ్యం వివరాలను అడిగి తెలుసుకొని,సిఎంఆర్‌కు సంబంధించిన పెండింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మండలంలోని ప్రతిపాదిత నూతన మండల రెవెన్యూ కార్యాలయం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రీ-సర్వే పనులను సమీక్షించి, సర్వేకు సంబంధించిన వివరాలను ఫీల్డ్ రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు, అన్ని సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :