Monday, 14 September 2026 12:24:14 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

20న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి...

కాటారంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి...

Date : 18 April 2026 10:02 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈనెల 20న భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలో పర్యటిం చనున్నారు. ఈ నేపథ్యం లో కాటారం మండలం నస్తూరిపల్లిలో బహిరంగ సభనిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐ డి ఓ సి కార్యాలయంలో సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్ పి సిరీశెట్టి సంకీర్త్, భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ తో పాటు భూపాలపల్లి జిల్లా అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళే శ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా 2023 ఎన్నికల సమయం లో ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభు త్వం భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ఈ కమిషన్ ఏర్పాటు అది సమర్పిం చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానికి సంబంధించిన తుది తీర్పు త్వరలోనే వెల్లడి కానుంది. ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్‌ రెడ్డి, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని స్వయంగా పరిశీలించనున్నారు. గతంలో కుంగిపోయిన ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన. పిల్లర్లను పరిశీలించి పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇంజి నీరింగ్ అధికారులతో రేవం త్ రెడ్డి చర్చించనున్నారు. అదే సమయంలో కాళే శ్వరం పరిధిలోని గోదావరి నది వద్ద నిర్వహించినున్న సరస్వతి అంత్య పుష్క రాల ఏర్పాట్లపైనా సీఎం రేవంత్ రెడ్డి, సమీక్ష చేయ నున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :