Tuesday, 28 July 2026 11:38:39 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం

వైద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్

Date : 16 October 2025 07:59 PM Views : 250

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు . గురువారం సాధారణ తనిఖీల్లో భాగంగా పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయనే వివరాలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. ఓ పీ, ఐ పీ ల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా పెరిగిందని వివరించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఉద్యోగుల హాజరును పరిశీలించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో విధులు నిర్వహణపై వివరాలు సేకరించినట్లు వివరించారు.ల్యాబ్, స్కానింగ్ ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయని రోగులకు తెలిపారన్నారు. ఆసుపత్రి పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు.రోగులకు అన్ని సేవలు అందుతాయని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆసుపత్రి ఖాళీగా ఉన్నటువంటి వైద్యుల పోస్ట్ లను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :