ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థి దిశ నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించడమే కాకుండా సామాజిక సేవలో సైతం ముందుండి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన ఖాజా మొయినుద్దీన్ కు మున్సిపల్ కో ఆప్షన్ పదవి ఇవ్వాలని యువత, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. 2009లో ఎన్ ఎస్ యు ఐ లో చేరి విద్యార్థి సంఘం నాయకునిగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి పార్టీ పెద్దల మన్ననలు పొందారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో విద్యార్థులకు అండగా నిలబడాలి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కరోనా విపత్కర సమయంలో పేద ప్రజలకు అండగా ఉంటూ అన్ని తానే చేసిన సేవలను స్థానికులు ఇప్పటికీ మరువలేదు. ఖాజా మొయినుద్దీన్ తండ్రి జమీల్ అహ్మద్ గతoలో మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యునిగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కో ఆప్షన్ సభ్యులకు ఎంపీటీసీ కి సమానoగా గౌరవ వేతనం అంధేలా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో మంత్రులతో అనేక మార్లు చర్చలు జరిపి G.O. CIRCULAR జారి చేయించడం ఫలితంగానే ఈరోజు కో ఆప్షన్ సభ్యులకు గౌరవ వేతనాలు అందుతున్నాయి.
పార్టీలకతీతంగా కుల మత పేద ధనిక తేడా లేకుండా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు సాగుతూ మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఖాజా కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న ఖాజా మొయినుద్దీన్ కు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యునిగా అవకాశం కల్పించాలని మున్సిపల్ ప్రజానీకం, యువత కోరుతున్నారు.
Admin
E Nivas News