ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మెజిస్ట్రేట్ పూర్ణచందర్ , ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని సీనియర్ ఓటర్లను సన్మానించనైనది. అదేవిధంగా సిరోల్ మండల పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాలలో బి. ఎల్.ఓ.ల ఆధ్వర్యంలో, జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించనైనాదని అన్నారు. అందులో భాగంగా ఓటర్ల నమోదు ప్రాధాన్యత 18 సంవత్సరాల నుండి నా ప్రతి యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు ను నమోదు చేసుకోవాలని సరైన నాయకున్ని ఓటు హక్కు తో ఎన్నికలలో ఎన్నుకోవాలని కోరనైనది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులు, కార్యాలయ సిబ్బంది సీరోల్ గ్రామ బిఎల్వోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News