ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ మాట్లాడుతూ, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్య శోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసి అన్ని మతాలు, కులాల ప్రజలను చేర్చుకొని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని అన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే భారతదేశంలో బాలికల కోసం పూణేలో 1848లో ఒక పాఠశాలను ప్రారంభించారన్నారు. అంతేగాకుండా విద్య యొక్క విశ్వీకరణను సమర్ధించిన మొదటి సంస్కర్త కూడా పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలేకు చిన్నప్పటి నుంచి శివాజి అంటే అభిమానం ఎక్కువని శివాజి, జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు మంథని సత్యనారాయణ, ,పేరవేన లింగయ్య, ఊదరి శంకర్, ఆరేళ్లి కిరణ్ గౌడ్,చంద్రు రాజమల్లు, దొరగోర్ల శ్రీనివాస్, ఎరుకల ప్రవీణ్,కొత్త శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, బాలాజీ, మబ్బు తిరుపతి, భూడి ద రంజిత్, ఎరుకల రమేష్ బాబు, ఫయీo, ఇల్లుటo రమేష్, పసుల ప్రసాద్, తాళ్ల సత్యనారాయణ, సవాయి గణేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News