ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజా సమస్యలు పరిష్కారంకై జనసేన ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతామని ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి చుంచు రాజ్ కిరణ్ పేర్కొన్నారు. బుధవారం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు, జనసేన నాయకులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విశ్రాంతి భవన ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూపవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీని మంచిర్యాల నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసి, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మంథని సంపత్, మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు నల్లతీగల మహేష్, రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు రక్షిత్, జిల్లా నాయకులు బియ్యాల దినేష్, కంటెస్టెంట్ అభ్యర్థులు చింతల రంజిత్, రాచర్ల రాకేష్, పిట్టల నరేష్, గుడిసెల సాయి, అవునూరి కిరణ్, మహేష్, చుంచు సాయి, కట్ట సంతోష్, ఆషిక్, ఆవుల వెంకటేష్, రాజశేఖర్, రఘు, సిద్దు, సమీర్, ప్రేమ, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News