Wednesday, 29 July 2026 06:29:14 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బ్రతికుండగానే స్మశాన వాటికలో వదిలి వెళ్లారు...

Date : 21 March 2026 11:37 PM Views : 239

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తిని బతికి ఉండగానే కుటుంబం శ్మశానవాటికలో వదిలి వెళ్లిన ఘటన జగిత్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన ఎండ్రికాయల శ్రీధర్ కు భార్య సునీత, ఇద్దరు కూతుళ్లున్నారు. ఉపాధి కోసం అయిదేళ్ల కిందట సౌదీ అరేబియా వెళ్లిన శ్రీధర్ ఓ కంపెనీలో పని చేసేవారు. వేతనం ఎక్కువే ఉన్నా జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులను పట్టించుకోవడం మానేశారు. ఇక్కడ సునీత కూలీ పని చేస్తూ పిల్లలను పోషించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీధర్ ను కంపెనీ స్వదేశానికి పంపింది. ఇంటికి వచ్చాక ఆయనకు కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం అందించారు. మూత్రపిండాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీధర్ ను కుటుంబసభ్యులు గురువారం రాత్రి పట్టణంలోని చింతకుంట శ్మశానవాటికలో వదిలివెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం అటువైపుగా వెళ్లిన వారు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సోదరుడు, భార్య తనను పట్టించుకోవడం లేదని శ్రీధర్ చెబుతున్నారు. కాగా శ్రీధర్ భార్యా పిల్లల పోషణను పట్టించుకోవడం లేదని, దీంతో వారు గాంధీనగర్లోని సునీత పుట్టింటికి వెళ్లారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీధర్ కు జిల్లా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :