ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల పోరాట ఫలితమే నీట్ లీకేజీపై విజయమని తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ 36 రోజుల పాటు విద్యార్థులు చేసిన పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ తన ఖాతాలో వేసుకోవడం సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్రమంత్రి రాజీనామాతో పాటు విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం వారి ఉద్యమ విజయమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను యువత ప్రశ్నిస్తారనే భయంతోనే సీఎం డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎక్కడైనా ఇలాంటి పరిణామాలు సంభవిస్తే విద్యార్థులు చేసే పోరాటాలకు తలవంచడం తప్పదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Admin
E Nivas News