ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన సౌటపల్లి మౌళి (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. మృతుడు రోజు మాదిరిగా శనివారం ఉదయం 4 గంటలకు తన భార్యతో వాకింగ్ వెళ్తానని చెప్పి వెళ్ళాడు. 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని జాడకోసం వెతకాగా డౌడేపల్లి గ్రామ శివారులో వ్యవసాయ బావి దగ్గర బైక్ పెట్టి వ్యవసాయ బావివద్ద చెప్పులు సెల్ ఫోన్ పెట్టి ఉన్నాయని, తెలియడంతో బావిలో వెతకాగా మృత దేహం లభ్యం అయిందన్నారు. మృత్తునికి ఆర్థిక ఇబ్బధులతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అతని తండ్రి లచ్చన్న పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. మృత్తునికి భార్య సంజన 10 నెలల వయస్సు గల జయరాం అనే కొడుకు ఉన్నాడు అని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.
Admin
E Nivas News