Friday, 11 September 2026 07:39:58 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

వరి ధాన్యం కొనుగోలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

Date : 08 September 2026 10:10 AM Views : 36

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వానాకాలం 2026-27 సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కొరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు . సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మెప్మా, డి సి ఎం ఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2026- 27 కు సంబంధించి జిల్లాలో అవసరమైన గోదాములను గుర్తించి సిద్ధం చేయాలని, సంబంధిత ఏజెన్సీ లతో సన్నాహక సమావేశాలు నిర్వహించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రదేశాలలో చదునుగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేసేలా చూడాలని, జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నాటికి సంబంధిత ఏజెన్సీలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని సిద్ధంగా ఉండాలని, అక్టోబర్ 1వ తేదీలోగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పి సి ఎస్ ఎ పి అప్లికేషన్ లో 16 ప్రశ్నలకు రియల్ టైం ఫొటోస్ నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల రీ కన్ఫ్లేషన్ త్వరితగతిన పూర్తి చేయించాలని, వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆన్ లైన్ ప్రకారం ట్రక్ షీట్స్ జనరేషన్, గోనె సంచుల నిర్వహణ, లారీలకు జియో టాగింగ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టేలా అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారుల తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :