ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని శ్రద్దగా చదివినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ రాస మల్ల తెలిపారు. మంగళవారం పట్టణంలోని వైష్ణవి మహిళ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నిలబడాలని ఆయన సూచించారు. మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, న్యాయవాది గడికొప్పుల కిరణ్ , రహమతుల్లా ,రవీందర్ చాతరాజు శివ శంకర్, కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల కిరణ్ కుమార్ మరియు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News