ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ మహిళా నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్ల, నాయకురాల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ సోమవారం కల్వకుంట కవిత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు . గత పది సంవత్సరాలు మీ డాడీ కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీ మా మంచిర్యాలని అభివృద్ధి చేయలేదన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి విషయంలో మా మంచిర్యాల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కల్వకుంట కవిత అలియాస్ (లిక్కర్ కవిత) ఇంకోసారి మా మంచిర్యాలఅడుగుపెడితే తప్పకుండా మంచిర్యాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలందరూ తరిమి కొడతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు లిక్కర్ కవిత తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News