ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామపంచాయితీలో న్యూ విజన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ డాక్టర్స్ సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శాతరసి బానేష్ మాట్లాడుతూ కండ్లు బాగా ఉంటే మనం ఎటువంటి పనినైనా చేయగలమన్నారు. నేటి సెల్ ఫోన్ ప్రపంచంలో కంటి సంబంధిత రోగాలు అధికంగా పెరుగుతున్నాయన్నారు. సరైన విశ్రాంతి లేకుంటే కళ్ళు దెబ్బతింటాయన్నారు. వయసు రీత్యా వచ్చే కంటి వ్యాధుల కంటే నేడు యువతలోనే ఎక్కువ కంటి జబ్బులు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేసుకుని మంచి ఆరోగ్యంతో జీవించాలని కోరారు. పుష్పగిరి ఆసుపత్రి, న్యూ విజన్ ఐ కేర్ సెంటర్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఈ కంటి పరీక్షల్లో అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, వార్డ్ సభ్యులు వెంకటేష్, నవీన్, పంచాయితీ కార్యదర్శి రాజమణి,కంటి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News