ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమితి బుధవారం ప్రారంభమై గురువారంతో ఘనంగా ముగిసింది. కార్తీక మాసం చివరి రోజు కావడంతో మంథని పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి, శ్రీ భిక్షేశ్వర స్వామి, శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి, గోదావరి నది తీరంలో గల శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయాల్లో విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసంలో నెల రోజులపాటు శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి ఆలయంలో నెలరోజుల పాటు భజన కార్యక్రమము నిర్వహించారు. గురువారం శ్రీ శీలేశ్వర, సిద్దేశ్వర స్వామి దేవాలయంలో రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు చక్రిభజన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు లోకే మనోహర్, లోకే శరత్ లు అన్నదానం ఏర్పాటు చేశారు. అన్ని వాడలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. అలాగే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన మంథనిలోని అన్ని దేవాలయాలను భక్తులు దర్శించుకున్నారు.
Admin
E Nivas News