ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిఆరోపించారు. గురువారం ఖమ్మంలో పాత్రికేయులతో మాట్లాడుతూ 'రీడిజైన్ పేరుతో ప్రాజెక్టుల ఖర్చు పెంచారు. లక్ష కోట్ల కాళేశ్వరం కూలిపోయిం దన్నారు. కాళేశ్వరంలో నాణ్యతా ప్రమాణాలుపాటించలేదు. దేవాదుల పనులు పూర్తి చేయలేదన్నారు. ఎన్ డి ఎస్ ఏ ప్రకారం నడుచుకుంటాం' అని అన్నారు. మా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ప్రజా సంక్షేమం కోసమేనని మా స్వార్థం కోసం కాదన్నారు. అభివృద్ధి చేద్దామనుకుంటా ఉంటే ప్రతి విషయంలో బి ఆర్ఎస్ వాళ్లు అడ్డుపడుతున్నారని ప్రజలు గమనించాలని తెలిపారు.
Admin
E Nivas News