Friday, 11 September 2026 07:39:13 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి

Date : 09 September 2026 09:24 PM Views : 29

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో గత మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అక్రమ అరెస్టులు, నిర్బంధాన్ని నిరసిస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగ సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూఒకవైపు ప్రజాపాలన అంటూ మరొకవైపు నిర్బంధ పాలన కొనసాగించడం సరైనది కాదన్నారు.ఈ అప్రజాస్వామికమైన విధానాన్ని నిర్బంధ పాలనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలన్నారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆశా వర్కర్లు తగిన బుద్ధి చెప్తారని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఆశా యూనియన్ (సీఐటీయు) జిల్లా వర్కింగ్ అధ్యక్షురాలు శోభ మాట్లాడుతూరాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగించే లోపు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000 లునిర్ణయించాలని,ఈపీఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఇతర డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం రూ.18,000 లు నిర్ణయించకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం మద్దతుగా కనికరపు అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, పద్మ ఆశా యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సభ్యులు, సునీత సువర్ణ లక్ష్మి మమత తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :