ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంతే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామ సభల్లో ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అలాగే విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై విస్తృత అవగాహన కల్పించాలనిఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలతోఅనుసంధానం చేయాలని,తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు కచ్చితంగా చెల్లించబడేలా చూడాలని,99 డేస్ ప్రోగ్రామ్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సిఎస్. రామకృష్ణారావు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తెలంగాణలోని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Admin
E Nivas News