ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులు మృతి చెందారని ఆరోపిస్తూ బారాస ఆధ్వర్యంలోఉత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో బారాస ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనక పోవడం వల్లనే ప్రాణనష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడం మరిచి ప్రభుత్వం వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్లనే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బారాస ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి నివాళులు అర్పించారు. విషయం తెలిసిన వెంటనే మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాసరావులు రాస్తారోకో వద్దకు వెళ్లి రాస్తారోకో చేస్తున్న రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశారు.ఈ రాస్తారోకో లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రాష్ట్ర నాయకుడు విజిత్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News