ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ నగరంలో కల్తీ మసాలాల తయారు కేంద్రాలపై ఫుడ్ యాంటీ స్పెషల్ టీం,ఆధ్వర్యంలో మంగళవారం మెరుపు దాడులు చేశామని హైదరాబా ద్ సిటీ సీపీ సజ్జనార్ తెలిపారు.13 మసాలా వ్యాపార సంస్థలలో తనిఖీలు నిర్వహించామన్నారు. స్థానికులు ఇచ్చిన విశ్వసనీయ సమా చారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగాకల్తీమసాలాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా అనేక రకాల మసాలాల్లో విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నట్లు అధికారు లు గుర్తించారు. మసాలాలు ఆకర్షణీ యంగా, మెరుస్తూ కనిపించడం కోసం టాల్కమ్ పౌడర్, హానికర రసాయనా లు, ఇండస్ట్రియల్ డైలు, ఫ్యాబ్రిక్ కలర్స్ మరియు సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నాసిరకం ఉత్పత్తు లకు రంగులు అద్ది నాణ్యమైన మసాలా లుగా మార్కెట్లో అమ్ముతున్నారని తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, అలాగే తయారీకి ఉపయోగించే 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. మైలార్దేవ్పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 3 కేసులు నమోదు చేయగా, ఈ వ్యవహారంలో ప్రధానంగా ఉన్న ముగ్గురు నిందితు లను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను తదుపరి విచారణ నిమిత్తం ల్యాబ్ పరీక్షలకు పంపించి నట్లు పేర్కొన్నారు.
Admin
E Nivas News