ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గురువారం మరో తియ్యటి కబురు అందించింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించిన ప్రతిష్టాత్మక "రైతు భరోసా" నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. నిధుల విడుదల అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రూ. 9,000 కోట్ల నిధులకు సీఎం ఆమోదం ప్రస్తుత వానాకాలం సాగు పెట్టుబడి నిమిత్తం ఏకంగా రూ. 9,000 కోట్ల భారీ బడ్జెట్ను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. 73 లక్షల మంది రైతులకు లబ్ధి: ఈ సరికొత్త నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు *73 లక్షల మంది రైతులకు* నేరుగా లబ్ధి చేకూరనుంది ఎకరానికి రూ. 6,000 ఆర్థిక సాయంగతంలో కంటే భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6,000 చొప్పునభారీ ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకోబోతోంది. పెట్టుబడి సాయంతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్, రైతు వేదికల ద్వారా సబ్సిడీ విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ చేపడుతూ వ్యవసాయ రంగాన్ని పండుగ చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి మధిర పర్యటన, బహిరంగ సభ విజయవంతం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు,ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించారు.
Admin
E Nivas News