ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని విశ్రాంతిభవనంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి నాదే పూర్తి బాధ్యతని నాపై నమ్మకం ఉంచి ఏ విధంగా గెలిపించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా భారీ విజయంతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. హాజీపూర్ మండలంలో దేశంలోనే ప్రతిష్టాత్మక మొదటి ఫిష్ పాండ్ నిర్మాణం, మెడికల్ కాలేజ్ ఇండస్ట్రియల్ పార్క్, లక్షెట్టిపేటలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఆసుపత్రి నిర్మాణం, దండేపల్లిలో సోలార్ ప్లాంట్ ఇంకా ఎన్నో రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు నాగభూషణం, ఆరీఫ్, త్రిమూర్తి, అంకతి శ్రీనివాస్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్, గోప రమేష్, మహిళ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News