ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చేయూత సామాజిక భద్రత పింఛన్ల కొరకు అర్హులైన అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం తోపాటు మున్సిపల్ కార్యాలయం లలో దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, సికిల్ సెల్, తలసేమియా, హేమోఫోలియా, బీడీ కార్మికులు, బీడీ టెకెదర్లు, బోదకాలు, డయాలసిస్, చేనేత కార్మికులు పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం, కుల ధ్రువీకరణ పత్రం, యు డి ఐ డి,సదరం ధ్రువీకరణ పత్రం జత చేయాలని, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News