Tuesday, 28 July 2026 11:19:22 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

ఉద్యోగ జీవితంలో విరమణ తప్పనిసరి పెద్దపల్లి డి ఐ ఈ ఓ కల్పన

Date : 31 December 2025 07:04 PM Views : 337

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఉద్యోగుల జీవితంలో పదవీ విరమణ అనేది తప్పనిసరిని పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కల్పనా అన్నారు. బుధవారం మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ సలీం పదవి విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సయ్యద్ సలీం 30 సంవత్సరాలకి పైగా ఉపాధ్యాయ, అధ్యాపక జీవితంలో ఎంతోమంది ఉన్నత స్థానాల్లో నిలవడానికి కారణమయ్యారన్నారు. విధుల్లో అందరితో సరదాగా ఉంటూనే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని క్రమశిక్షణలో పెట్టడంలో ముందుంటారన్నారు. తమతో ఎన్నో ఏళ్ళుగా కలిసి పనిచేసిన సలీం సార్ తమ విధుల నుండి దూరం అవుతున్న బాధ ఎంతో ఉంటుందని ఆయన తన శేష జీవితాన్ని ఆనందోత్సవాలతో కుటుంబల మధ్య గడపాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయ స్థాయి నుంచి కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసే నేడు పదవీ విరమణ పొందిన సయ్యద్ సలీం సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిఐఈఓ , ప్రిన్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రవీందర్ రెడ్డి, మంచిర్యాల డి ఐ ఈ ఓ అంజయ్య, జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపళ్ళు కే రామచంద్ర రెడ్డి, సంజీవయ్య, రవీందర్ రెడ్డి, విశ్వ ప్రసాద్, సుధాకర్, ఉష, రిటైర్డ్ ప్రిన్సిపళ్ళు అంబరీష్, లయాకలీ , పెద్ద సంఖ్యలో పూర్వ , ప్రస్తుత విద్యార్థులలో పాటు అభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :