Thursday, 30 July 2026 04:17:34 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

శ్రీరామనవమిన కవిత జాగృతి పార్టీ ప్రకటన

Date : 26 March 2026 10:46 PM Views : 144

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక సారథిగా ఉన్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు రాజకీయ శక్తిగా అవతరించేందుకు సిద్ధమయ్యారు. శ్రీరామనవమి పర్వదినాన ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశం అధికారం సాధించడం కంటే, తనను దూరం పెట్టిన బీఆర్ఎస్ పార్టీ పునాదులను కదిలించడమే లక్ష్యంగా తనపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రతీకారంగా, బీఆర్ఎస్ స్థానంలో తన పార్టీని అసలైన ప్రాంతీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారు. కవిత తీసుకున్న ఈ నిర్ణయం కల్వకుంట్ల కుటుంబంలోనే కాకుండా పార్టీలోనూ పెద్ద చీలిక తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు తండ్రిగా కేసీఆర్ ఏమీ చెప్పలేక మౌనం వహిస్తుంటే మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మాత్రం కవితతో రాజీ పడే ప్రసక్తే లేదని సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావుల ఆధిపత్యం పెరిగిందని, వారు కేసీఆర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత బాహాటంగానే ఆరోపిస్తున్నారు. హరీష్, సంతోష్‌లను వదులుకుని కవితను మళ్ళీ దగ్గరకు తీసుకోలేని స్థితిలో కేసీఆర్ ఉండటంతో, పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఆ పార్టీలో అవకాశాలు దొరకని వారు కవిత పార్టీలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలపైనే కవిత గురి పెట్టింది.కవిత వ్యూహం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. బీఆర్ఎస్ బలమైన కోటగా భావించే సిద్దిపేట నుండి ఆమె పోటీ చేసే అవకాశాలుకనిస్తున్నాయి. ముఖ్యంగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ఆయన క్యాడర్‌ను తన వైపు తిప్పుకోవాలని ఆమె చూస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, కేసీఆర్ పాలనలో జరిగిన పొరపాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ పార్టీకిప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం కవిత ప్రధాన ఎజెండా. ఇది నిశ్చయంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడమే కాకుండా, ఆ పార్టీఉనికికేప్రమాదకరంగామారనుంది. కవిత పోరాటానికి పరీక్ష.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి క్లీన్ చిట్ పొందిన తర్వాత, కవితలో రాజకీయ తెగింపు పెరిగింది. తాను ఒక బాధితురాలినని, సొంత పార్టీ నేతలే తనను ఇరికించారని ఆమె భావిస్తున్నారు. అందుకే వ్యక్తిగా వెళ్తున్నాను. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అన్న ఆమె నినాదం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ ఇమేజ్ లేకుండా, కేవలం జాగృతి సెంటిమెంట్‌తో ఆమె ఎంతవరకు నెట్టుకొస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. శ్రీరామనవమి రోజున ఆమె చేసే ప్రకటనతో తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయని విశ్లేషకులు చర్చిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :