ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి తొత్తుగా మారొచ్చేమో కానీ, తెలంగాణ ప్రజలు మాత్రం కాదని టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. పొలిటికల్ విమర్శలు చేసినందుకు తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. ఏపీ పోలీసులకు టీజీ పోలీసులు సహకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అతడిని లాక్కెళ్తుంటే భార్య, పిల్లలు ఏడుస్తున్న వీడియో హృదయవిదారకంగా ఉందని అన్నారు. తెలంగాణావాదాన్ని వేర్పాటువాదమనే సినీనటుల విషయంలో పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారని గుర్తు చేశారు.
Admin
E Nivas News