Saturday, 12 September 2026 09:25:47 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తా..

Date : 11 August 2026 11:17 PM Views : 98

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తే సిరిపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణంతో తూర్పు ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని, గత 3 సంవత్సరాలుగా అదిగో ఇదిగో అని రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం విచిత్రంగా ఉందని తెలిపారు. ఒక్క కౌటాల మండల గ్రామ పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నుండి రూ.17.5 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, దానికి అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సిందే అని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం జీపీలకు తన వాటా ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలు నడుస్తున్నాయని తెలిపారు. కౌటాల మండల కేంద్రంలో మినీ స్టేడియం అభివృద్ధి, నూతన శాఖా గ్రంధాలయ భవనం మరియు మెయిన్ రోడ్ ను సిసి రోడ్డుగా మార్చడం తదితర పనులుచేపట్టనున్నామని తెలిపారు. మండలంలో లో వోల్టేజ్ మరియు లోడ్ షెడ్డింగ్ సమస్య ఉన్నదని సర్పంచులు తమ దృష్టికి తీసుకొచ్చారని, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విటల్, ఎంపీడీవో ప్రసాద్, తాసిల్దార్ ప్రమోద్ కుమార్, సింగల్ విండో చైర్మన్ మాంతయ్య, కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :