ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పీఎం జన్మన్ పీఎం జుగాపై అవగాహన సదస్సులు మౌలిక వసతులు ఆర్థిక స్వాలంబనే లక్ష్యం అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలతో గిరిజన ఆదివాసీల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయని జిల్లా గిరిజన క్రీడల అధికారి బండ జీవరత్నం తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గడ్పూర్ గ్రామ పరిధిలోని నాయకపు గూడా, బాబర్ నగర్ గ్రామంలో పీఎం జన్మన్ , పిఎం జుగా పథకాలపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆదేశాల మేరకు జరిగిన ఈ సభల్లో తీర్మానాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ స్కీములు గిరిజనులకు చేర్పిస్తామన్నారు. పీఎం జన్మన్ తో మౌలిక వసతులు... పీఎం జన్మన్ తో పతకం ద్వారా ప్రత్యేక కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు ఉచిత విద్యుత్ సదుపాయం వివరించారు. కల్పించడంతోపాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ తో పాటు ఉచిత ఆరోగ్య కార్డులో జారీ చేస్తామని అన్నారు. పీఎం జుగాతో ఆర్థిక ప్రగతి... పీఎం జుగా పథకం ద్వారా గిరిజన యువతకు ఉపాధి త నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామని తెలిపారు. మహిళ సాధకతకు ప్రాధాన్యత ఇస్తూ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. స్పష్టం చేశారు తమ ఆర్థిక అభివృద్ధికి అన్ని అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టినట్టు దేశ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి గ్రామ ప్రముఖులు ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి సప్న, ఉపసర్పంచ్ బి వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ శ్రావణ్,కార భారీ మనోహర్,ఆశా వర్కర్ డి అరుణ సువర్ణ, ఏఎన్ఎం ఎం పద్మ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Admin
E Nivas News