Thursday, 15 January 2026 05:43:31 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం...

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

Date : 14 January 2026 09:50 PM Views : 25

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : ముగ్గుల పోటీలు భారతీయ మహిళల సృజనాత్మక నిలువెత్తున నిదర్శనమని మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ అన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరయ్, ఆ లైవ్ కార్యక్రమంలో భాగంగా రేగోడ్ మండలం చౌదరిపల్లి గ్రామంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఇంటి ముందర వేసే ప్రతి ముగ్గు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా, మన సంస్కృతి, విలువలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం (డ్రంక్ అండ్ డ్రైవ్), అతివేగాన్ని నివారించడం, రోడ్డు పై ఉన్న ట్రాఫిక్ సూచికలను గమనిస్తూ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను తప్పనిసరిగా అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని అదనపు ఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రోడ్డు ప్రమాదాలనివారణ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేగోడ్ ఎస్ఐ పోచయ్య, గ్రామ సర్పంచ్ రాయిపల్లి సురేందర్, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :