ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో నూరు శాతం పన్నుల వసూలు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబ్రహ్మయ్య ఆదేశించారు. గురువారం మంథని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో కంకణాల శ్రీజా రెడ్డి అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సిగ్రీగ్రేషన్ షెడ్డుల్లో వేరు చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహిస్తూ పంచాయతీ రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు సక్రమంగా చేయాలని, సిటిజన్ పోర్టల్ అప్డేట్ చేయాలన్నారు. మంథని ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Admin
E Nivas News