ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యారాలు కె.రమా కళ్యాణి మేడం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల నవంబర్ 4న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అదిలాబాదులో నిర్వహించిన జోనల్ స్థాయి కుస్తీ పోటీలలో లక్షెట్టిపేట గురుకుల విద్యార్థినులు జి భువనేశ్వరి, టీ అక్షర, సిహెచ్ హారిక, ఎం స్వర్ణలత, జి పావని, ఏ వర్షిత మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు . ఈ రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ 23 నుండి 24 వరకు ఖాదర్ పహెల్వాన్ రెజ్లింగ్ క్లబ్ బాసర్గట్లో నిర్వహిస్తున్నారని పీఈటీలు డి రమాదేవి,సిహెచ్ మమత తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
Admin
E Nivas News