ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : హైకోర్టు స్టే తో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అంశంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా హైకోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తీర్పునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే హైకోర్టు రెండు వారల్లో పిటిషన్ వేసి నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలనడంతో ఆరువారాల పాటు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్డర్ కాపీ పరిశీలించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి.
Admin
E Nivas News