ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నీట్ పేపర్ ముసుగులో సంఘ విద్రోహశక్తులను పెంచి పోషిస్తు దేశంలో అలజడి సృష్టిస్తున్న లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ బుధవారంలక్షెట్టిపేట బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనిమాట్లాడుతూ నేటి పేపర్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్ లో చర్చలో పాల్గొనకుండా నీట్ పేపర్ ముసుగులో దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్న దేశ విద్రోహ శక్తులను రెచ్చగొట్టి దేశంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయడం సిగ్గు చేటు అని అన్నారు. నిన్న ప్రధాన మంత్రి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టడం దేశ చరిత్రలో ఒక్క బ్లాక్ డే అని అన్నారు. రాహుల్ గాంధీకి నీట్ పేపర్ లీకేజీ పై చర్చ పై చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్ లో చర్చలో పాల్గొనాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News